భాగ్యనగరం శివారు ప్రాంతం కొంపల్లి పరిధిలోగల బీబీఆర్ గార్డెన్ వేదికగా ఇవాళ జరుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీనరీ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ.. వేదికపై డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై ఉన్నారని, వారందరూ తమ శక్తిని దారబోసి, తీర్మానం చేసి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బాధ్యతను తనపై పెట్టారన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు.. హైదరాబాద్ను వదులుతారని అనుకుంటారేమో.. హైదరాబాద్ నుంచి దేశ రాజకీయాల్లో భూ కంపం పుట్టిస్తానంటూ చెప్పారు కేసీఆర్.
see also : వైసీపీలోకి మరో సీనియర్ నేత..! డేట్ ఫిక్స్..!!
మన దేశంలో 60 శాతం యువత, అద్భుతమైన పంట భూమి, వనరులు, కష్టపడే ప్రజలు ఉన్నారని, వీటన్నిటిని ఉపయోగించుకుని దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ నాయకులు, నేతలు, కార్యకర్తలు ఇచ్చిన స్ఫూర్తితో గతంలో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ పేరును ప్రపంచం కొనియాడాలే ఉద్యమిస్తానంటూ సీఎం కేసీఆర్ చెప్పారు.