మరికొన్ని రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.ఈ ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు
. బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. ఓటు వేయ నిరాకరించే ఓటర్ల కాళ్లు, చేతులు కట్టి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల్లారా.. మనకు విశ్రాంతి లేదు. ఎవరైన ఓటర్లు ఓటు వేయడానికి నిరాకరిస్తూ, పోలింగ్ బూత్కు రావడం లేదని మీ దృష్టికి వస్తే వారింటికి వెళ్లి, కాళ్లు, చేతులను కట్టేసి పోలింగ్ బూత్కు తీసుకురండి. బీజేపీకి ఓటు వేయించండి అని అన్నారు. నేను సీఎం కావడం ఖాయం. ఎవరూ అడ్డుకోలేరు అని సంచలన వాఖ్యలు చేశారు.