తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు.
ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కంటే ముఖ్యమంత్రులే ఎక్కువగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు .గత డెబ్బై ఏళ్ళలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని గత నాలుగు ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేసి చూపిస్తుంది .దాదాపు ఆరు దశాబ్దాల మెదక్ ప్రజల చిరకాల వాంఛ జిల్లా ఏర్పాటును టీఆర్ఎస్ సర్కారు నెరవేర్చింది .మెదక్ జిల్లాకు రైలు వస్తుంది .మొత్తం వంద కోట్ల రూపాయలతో ఘనపురం ఆనకట్టను బాగుచేయించాం ..
దీంతో ఘనపురం ఆనకట్ట కింద ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంట పండుతుంది .వెయ్యి కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి మంచి నీళ్ళు ఇస్తున్నాం .యాబై కోట్లతో నాలుగు లైన్ల రోడ్లను నిర్మిస్తున్నాం .కొత్తగా జిల్లాలో నూట యాబై ఒక్క గ్రామపంచాయితీలను ఏర్పాటు చేశాం .వంద పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రిని మూడు వందల యాబై పడకల ఆస్పత్రిగా తీర్చి దిద్దబోతున్నాం అని ఆయన అన్నారు ..