ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక
వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది.
విజయవాడ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నిర్మాతను వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.అయితే సదరు నిర్మాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్నట్లు సమాచారం .
అయన ప్రత్యేక్షంగా సినిమాలను నిర్మించకపోయినా కానీ ఇండస్ట్రీలో ఉన్న భారీ నిర్మాతల దగ్గర నుండి చిన్న చిన్న నిర్మాతల వరకు అందరికీ ఫైనాన్స్ సపోర్టింగ్ ఇస్తారని ..బయట ఆయనకు సినిమా ఐమాక్స్ ధియేటర్ల దగ్గర నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయని .ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ప్రముఖ పారిశ్రామిక వేత్త అని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.అయితే గతంలో ప్రముఖ వ్యాపార వేత్త పీవీపీ వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.దిన్ని బట్టి చెప్పొచ్చు జగన్ ఎవర్ని రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ గా ఎవర్ని రంగంలోకి దించనున్నారో..?