ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది .
డబ్బులను ,కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది .మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి ..అసలు ఆయన ఎవరు ఒత్తిడి చేయడానికి ..ఆయనకు ఏ అధికారం ఉంది.ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది అని ఆయన ఫైర్ అయ్యారు.కర్ణాటకలో గవర్నర్ వ్యవస్థలు నాశనమయ్యాయి అని తన ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు ..