అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయచ్చు అనడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది . కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సాంతాలోని కోటినగర్ పంచాయితీలో ఈ రోజు ఆదివారం పర్యటించనున్నారు అని సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు .
అందులో భాగంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నా హెలికాప్టర్ కోసం ఏకంగా ఇరవై గ్రామాలలో కరెంటు
సరఫరాను నిలివేశారు అధికారులు .
అయితే హెలికాప్టర్ దిగే చోట హై టెన్షన్ విద్యుత్ తీగలున్నాయి.అందుకే ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాను ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఆ ఇరవై గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.