Home / NATIONAL / గొప్ప మనస్సు చాటుకున్న రజినీకాంత్..!!

గొప్ప మనస్సు చాటుకున్న రజినీకాంత్..!!

ప్రముఖ హిరో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటతడి పెట్టారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి ఘటనలో 13 మంది మృతి చెంది … అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా సూపర్ స్టార్ కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తన సొంత డబ్బును వీరికి అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారి వైద్య ఖర్చులకు కూడా సాయం చేయనున్నట్లు వెల్లడించారు .

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. సహనం కోల్పోయి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటం ముమ్మాటికీ తప్పేనని అన్నారు.ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు. పోలీసుల కాల్పులు అతిపెద్ద తప్పుగా రజినీకాంత్ అభివర్ణించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat