గత కొన్ని రో జులుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని వారబ్బాయి అఖిల్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కబోతోంది అంటూ ఇటీవల సోసల్ మీడియా కథనాలను ప్రచురించింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటనుంచి అక్కినేని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకు కారణం అక్కినేని అఖిల్కు సినిమాల పరంగా చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేకపోవడమే. నటించినవి రెండే సినిమాలు అయినా.. రెండూ డిజాస్టర్లే.
అయితే, రామ్గోపాల్ వర్మ, అఖిల్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది కదా..? అంటూ అడిగిన మీడియా మిత్రులకు నాగార్జున సంచలన విషయం చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి చర్చలేవీ జరగలేదు. వారి కాంబోలో సినిమానా..? అంటూ ఎదురు ప్రశ్నించారు. దీనినిబట్టి చూస్తే వారి కాంబోలో సినిమా తెరకెక్కడం నాగ్కు కూడా ఇష్టం లేదనే విషయం తేటతెల్లమవుతుందంటున్నారు చిత్రపురి కాలనీ వాసులు.