దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు దారుణంగా రెచ్చిపోతున్నారు.ప్రతి రోజు ఏదో ఒక చోట చిన్నా,పెద్దా అని తేడాలేకుండా మహిళలపై అత్యాచారం చేస్తున్నారు.తాజాగా నోయిడాకు సమీపంలో.. రెండేళ్ల చిన్నారిని 12 ఏళ్ల కుర్రాడు దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ పాపని బాలుడు గ్రామశివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో అక్కడున్న రాళ్లతో కొట్టి ఆ పాపను చంపాడు . అయితే తమ చిన్నారి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బట్టబయలైంది .
సిసిటివి ఫుటేజీ ఆధారంగా కేసును పరిశీలించన పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకుని ఆరాతీశారు. దీంతో తానే ఈ నేరాన్ని చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిని జువైనల్ హోమ్కు తరలించారు. అయితే ఈ బాలుడు నిత్యం ఫోన్లో నీలిచిత్రాలు చూస్తుండేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ నేపథ్యలోనే రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.