తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రముఖ స్వచ్చంద సంస్థ అయిన హరేకృష్ణ మూవ్ మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల రూ.ఐదుకే భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ కార్యక్రమం వలన నగరంలో కొన్ని లక్షల మంది ఆకలి తీరుతుంది.
ఈ పథకానికి నగర వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో కూడా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.దీనికి హారే కృష్ణ సంస్థ ముందుకు రావడంతో మొత్తం నూట పద్దెనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సర్కారు నిర్ణయం తీసుకుంది. వీటికి పదకొండు వంట కేంద్రాల నుండి సరఫరా చేయనున్నారు..