ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు..
రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు అస్మిత్ రెడ్డి బరిలోకి దిగనున్నారు అని ఆయన తేల్చిచెప్పారు. అయితే అప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొస్తే మరోసారి ఆలోచిస్తాను..
ఒకవేళ తనకు ఆరోగ్యం బాగోకపొతే రాజకీయాలకు గుడ్ బై చెప్తా అని కూడా ఆయన తెలిపారు.. అయితే ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగను అని ఆయన అన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే..