Home / 18+ / చంద్రబాబుకు ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు

చంద్రబాబుకు ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు

మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకొచ్చింది. వారెంట్ ఎందుకు అమలు చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది.

2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు, ఆయన వెంట వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat