మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకొచ్చింది. వారెంట్ ఎందుకు అమలు చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది.
2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు, ఆయన వెంట వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది.