Home / 18+ / ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు

వైఎస్సార్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శింస్తోంది. పార్టీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్‌అరెస్ట్‌ చేయటంతో జమ్మలమడుగుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం ఉందంటూ సుధీర్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పులివెందులలో వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నిన్న వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప్రచారానికి అనుమతించిన పోలీసులు నేడు నిరాకరించటంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat