ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి నుండి టీడీపీకి అందుబాటులో లేరని తెలుస్తుంది.దీనికంతటకి కారణం ఏమిటంటే ఆయన సీటుకే ఎసరు పెట్టడమే.గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి స్థానంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ను పోటీ చేయించడానికి ప్రయత్నించడంతో గంటా కంగుతిన్నారు.మరోవైపు జేడీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో గంటాను మరింత కలవరపెడుతున్నాయి.ఎందుకంటే ఈ స్థానం నుండి లోకేష్ లేదా జేడీ ని నిలబెట్టాలని బాబు అనుకోవడంతో గంటా శ్రీనివాసరావు అలిగారు.
అయితే ఇక్కడ ఎమ్మెల్యే గా వీరిద్దరి పేర్లు వస్తుంటే మరి గంటా పరిస్థితి..? ఆయనకు బాబు ఎంపీగా పోటీ చేయాలని చెప్పడంతో నిరాకరించారని తెలుస్తుంది.ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని బాబు చేసిన సూచనను గంటా ఆమోదించడం లేదు.ఆయన నిన్నటినుండి ఎవరికీ అందుబాటులో లేరని..నిన్న అమరావతి వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ వెళ్లినట్టుగా అంటున్నారు.తన సన్నిహితులు చెప్పిన కధనం ప్రకారం గంటా అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాడని తెలిసింది.