ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు.. తాజాగా వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కూడ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యకు గురయ్యారు. వైఎస్ రాజారెడ్డి కారులో వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు బాంబులు వేసి ఆయనను హత్య చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతల హస్తం ఉందని ఆనాడు కాంగ్రెస్ ఆరోపించింది. టీడీపీ నేతలు కొందరు ఈ కేసులో శిక్షను కూడ అనుభవించారు. 1998 మే 23వ తేదీన కారులో వెళ్తున్న రాజారెడ్డిని ప్రత్యర్ధులు దారికాచి హత్య చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కూడ ఎన్నికలకు నెల రోజుల ముందే హత్యకు గురికావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివేకానందరెడ్డిది తొలుత గుండెపోటుతో మరణించినట్టుగా భావించారు. కానీ, శరీరంపై గాయాలు ఉండడంతో హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ నేతలపై వైసీపీ ఆరోపణలు చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డిని రాజారెడ్డి హత్య కేసులో 13వ నిందితుడిగా చేర్చారు పోలీసులు.. తీర్పు సందర్భంగా 2006లో న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన నెల్లూరు జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. మొత్తం 11 సంవత్సరాల 10 నెలల పాటు మధుసూదన్ రెడ్డి జైలు శిక్షను అనుభవించారు.. గత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మొత్తం 47 మందిని ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో సుధాకర్ రెడ్డి ఒకరు.