ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏప్రిల్ నెల 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను తొలిజాబితాలో భాగంగా తొమ్మిది మందిని ఖరారు చేశారు..ఈ తొమ్మిది మంది పేర్ల జాబితాను వైసీపీ అధినేత జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.కడప నుండి వైఎస్ అవినాష్ రెడ్డి,రాజంపేట నుండి తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,అనంతపురం నుండి టి.రంగయ్య,హిందూపురం నుండి గోరంట్ల మాధవ్,అమలాపురం నుండి చింతా అనురాధ,బాపట్ల నుండి నందిగం సురేష్,కర్నూలు నుండి డాక్టర్ సి.సంజీవ్ కుమార్,చిత్తూరు నుండి నల్లకొండగారి రెడ్డప్ప,ఆరకు నుండి జి.మాధవి పేర్లను ఖరారు చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో జగన్ తెలిపారు..అయితే తొమ్మిది మంది అభ్యర్థులలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించడం ఇక్కడ మరో విశేషం.
