సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే కలయికలో వస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ కు ఇది 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలే పెట్టుకుంది చిత్ర యూనిట్.అంతేకాకుండా మహేష్ ఫాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.మహేష్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ కు సిద్దమవుతున్నాడు.యంగ్ డైరెక్టర్స్ అందరు కూడా మహేష్ తోనే సినిమా తియ్యాలని అనుకుంటున్నారు.ఇప్పటికే అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ సినిమా తీస్తానని స్వయంగా మహేష్ నే చెప్పాడు.అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం మహేష్ గీత గోవిందం డైరెక్టర్ పరశురాంతో కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.పరశురాం చెప్పిన కధ కూడా మహేష్ కి నచ్చిందట.శ్రీరస్తు శుభమస్తు,చుట్టాలబ్బాయి,గీత గోవిందం లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు పరశురాం.
