జగన్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు అధికారులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి జగన్ అనే నేను… అంటూ ప్రమాణ స్వీకారం చేసారు.
కేవలం స్టేడియంలోనే మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో లైవ్ లు చూసారు.
విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో LED స్క్రీన్లను ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ వచ్చారు.
యాజ్ యూజువల్గా విజయవాడలో హోటళ్లు, రెస్టారెంట్లూ కళకళలాడాయి.
ఎక్కడ చూసినా జగన్ కటౌట్లే కనిపించాయి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఫ్యామిలీలతో సహా వచ్చారు.
గవర్నర్ నరసింహన్ (ప్రమాణం చేయించారు. ), తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ జగన్తో కలిసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.
స్టేడియంలో 30,000 మంది మాత్రమే కూర్చునే ఛాన్స్ ఉంది.
మొత్తంగా 18 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
వీలైనంత ఎక్కువ మంది చూసేలా 14 ప్రదేశాల్లో LED స్క్రీన్లు రెడీ చేసారు.
VVIPల కోసం స్టేడియంలో మూడు ఎంట్రెన్స్లు ఇచ్చారు.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికీ 150 నుంచీ 200 పాస్లు అవి ఏమాత్రం సరిపోలేదు..
నిర్మాణాత్మక సలహాలు ఇస్తామన్న మాజీ సీఎం చంద్రబాబు హాజరుకాలేదు.
సెక్యూరిటీ కోసం 5000 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, బాడీ ఎటాచ్డ్ కెమెరాలూ రెడీ.
స్టేడియంకి వెళ్లేందుకు ప్రత్యేక సిటీ బస్సు సౌకర్యం కల్పించారు.
టెంట్లలో కూర్చునే ప్రజల కోసం మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు, మంచి నీళ్లు, స్నాక్స్ ఇస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఓ పండుగ లాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్భాటాలు లేకుండా తక్కువ ఖర్చుతో జగన్ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.