ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో విప్లవాత్మక మార్పులకు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, వలంటీర్లతో కలిపి మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని జగన్ ఆదివారం ట్విటర్లో తెలిపారు. తెలుగురాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డని జగన్ స్పష్టం చేశారు.
పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని, ప్రజల ఆశీర్వాద బలంతోనే ఇదంతా సాధ్యమవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన ట్వీట్ యధాతధంగా.. ‘తెలుగురాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు.. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం.. మీ ఆశీర్వాద బలంవల్లే ఇది సాధ్యమవుతోంది’అని సీఎం ట్వీట్ చేశారు.