ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదని కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అసలు విషయానికి వస్తే 2013లో సిద్దార్థ, సమంత జంటగా నటించిన చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రాన్ని సురేష్ నిర్మించారు. అయితే ఇందులోని కొన్ని సీన్లు 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ నుండి కాపీ చేసారని వాళ్ళు ఢిల్లీ హైకోర్ట్ ను ఆశ్రయించగా కోర్ట్ ఆ చిత్ర ప్రదర్శనను నిలిపివేసింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే టెలివిజన్ శాటిలైట్ టెలికాస్ట్ రైట్స్ ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కి విక్రయించడం జరిగింది. దీంతో ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఇవ్వలేదని కోర్ట్ ను ఆశ్రయించారు. అప్పటి రూ.3.5 కోట్లు ఇప్పుడు రూ.11.75 కోట్లకు చేరింది.
