వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత జ్ఞానోదయం కలుగుతుంది అనుకుంటే ఇప్పుడు ఉన్నది కాస్తా పోయిందని పవన్ పై సెటైర్లు వేసారు.