ఏపీ సీఎం జగన్ క్రీడాకారుల పట్ల విస్వతనీయంగా వ్యవహరించారు. వారికి వారాల జల్లు కురిపించారు.పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు ప్రతీఒక్కరికి నగదు ప్రోత్సాకాలు అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం ఆయన క్యాంపు ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ..‘క్రీడల మీద దృష్టి పెట్టాలని ప్రతీ దిగువ క్రీడాకారుడుని ప్రోత్సహించాలని అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత నుండి ఇప్పటివరకు జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాంమని అన్నారు. ఈ మేరకు పసిడి సాదించిన వారికి రూ.5లక్షలు, సిల్వర్ సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలు అందిద్దామని జగన్ అన్నారు.
జూనియర్, స్థాయి క్రీడాకారులనూ కూడా గుర్తించాలని, దీనికి సంభందించి జాతీయ స్థాయిలో పసిడి వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండి పతకం సాధిస్తే రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిద్దాం అన్నారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అప్పటి నుండి వారంరోజులు పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అన్నారు.