ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్పై గతేడాది సెప్టెంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్ కేసులో శివకుమార్ను మంగళవారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. గత కొన్నిరోజులుగా శివకుమార్ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివకుమార్ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది. సోమవారం ఉదయం నుంచి విచారణ కొనసాగించిన అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్కు ట్రబుల్ షూటర్గా ఉన్న శివకుమార్పై బీజేపీ కావాలనే కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Delhi: Ruckus outside the Enforcement Directorate (ED) office as supporters of Congress leader DK Shivakumar gather in large numbers. He has been arrested by the agency, under Prevention of Money Laundering Act (PMLA). pic.twitter.com/v7Kg7dm2IG
— ANI (@ANI) September 3, 2019