యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగష్టు 30న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మల్లా ఈ సినిమాతో వచ్చాడు ప్రభాస్. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా రిలీజ్ అయ్యాక అందరి మతిపోయింది. ఫ్లాప్ టాక్ అయితే రాలేదు గాని అనుకున్న రీతిలో మాత్రం సినిమా లేదు. కాని 350కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం మూడు రోజులకే 294 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది. ఇంత చేసినప్పటికీ సినిమా విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ప్రముఖ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సల్లో ‘సాహో’ సినిమాపై సంచలన కామెంట్స్ చేసాడు. అప్పట్లో నేను తీసిన సినిమాను అజ్ఞాతవాసిగా రీమేక్ చేసి ఫ్లాప్ చేసారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు సాహో సినిమా తీసారు ఇంక మారరా మీరు అని మండిపడ్డాడు. సాహో ‘అజ్ఞాతవాసి’కంటే వరస్ట్ గా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక్కప్పటి సినిమాలు అనుకుంటున్నారా కాపీ కొట్టిన తెలియకపోవడానికి. ఇప్పుడు ప్రతీ ఒక్కరు దానిపైనే దృష్టి పెట్టారని అన్నారు. పోనీ తీసిందేదో తీసారు కనీసం అదైన బాగుందా అంటే వరస్ట్ గా ఉందని విమర్శించాడు.
