మెగాకాంపౌండ్ హీరో వరుణ్ తేజ్,అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులకు రాబోతున్న లేటెస్ట్ మూవీ వాల్నీకి. ఈ చిత్రం ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో మరో క్రేజీ హీరో ముఖ్య పాత్రలో నటించనున్నారు. అతనే నితిన్.. ఇప్పటికే ఈ చిత్రంలో నితిన్ పాత్రపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.. 14రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
