తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గత మూడేండ్లుగా చీరెలను పంపిణీ చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మొత్తం పది రకాల డిజైన్లతో.. వంద రకాలతో కోటీకి పైగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుంది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చీరెలు అందుకుంటున్న ఆడబిడ్డలు పండక్కి పెద్దన్నలా చీరెలను పంపిణీ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బతుకమ్మ చీరెలను అందుకుంటున్న మహిళలు మాకు పండుగ ముందే వచ్చిందని సంబురంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.