సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు మేటర్ కు వస్తే విజయశాంతి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో అనీల్ స్టొరీ చెప్పిన రెండు గంటల సేపు చాలా నవ్వుకున్నాను అని చెప్పింది. దీనికి హర్ట్ అయిన మహేష్ ఫ్యాన్స్ మహేష్ సినిమా అంటే అంత కామెడీ గా ఉందా మీకు అన్నట్టుగా కామెంట్స్ చేయడం జరిగింది.
