ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఈ వివరాలను దాచిపెట్టి ఎన్నికల్లో పోటి చేశారు. గెలుపొందారు. కావున ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు నోటీసులు జారీ చేసింది కోర్టు.