టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రాజకీయాల్లో సెగను రేపిన విషయం అందరికి తెలిసిందే. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కేఎ పాల్ ఇలా అందరిని వాడుకున్నాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఒక పార్టీని మాత్రం టార్గెట్ చేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాను విడుదల చేసిన ప్రతీ క్లిక్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అయితే రేపు విడుదల అయ్యే సినిమాకు ఈరోజు వర్మ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది.అటు సినిమా పై కేసు పెట్టగా.. ఇటు సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో ఒక మెట్టు దిగిన వర్మ టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని మార్చడం జరిగింది. మరి ఇప్పుడైనా సెన్సార్ ఓకే చేస్తుందో లేదో వేచి చూడాలి.
