Home / ANDHRAPRADESH / మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!

మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని ఒక్కటే ఉండాలంటు జగన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నాయి..రాజధాని విషయంలో ఇంత గొడవ జరుగుతుంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వాఖ్యలు ఇఫ్పుడు దుమారం రేపుతున్నాయి. అమరావతిలో రైతుల దగ్గర నుండి తీసుకున్న 33వేల ఎకరాలను తిరిగి ఇచ్చేస్తున్నామని, రాజధాని భూములు తిరిగి ఇచ్చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడే హామీ ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. రాజధానిని తరలించొద్దంటు ధర్నాలు చేసేవారంతా టిడిపి కార్యకర్తలేనని ఆయన విమర్శించారు..రాజధానులు మూడు కాకుంటే ముప్పై పెట్టుకుంటామని కామెంట్ చేశారు. కేంద్రానికి రాజధానులతో సంబందం ఉండదని, దీని పై కేంద్రం జోక్యం అనవసరమన్నారు.

వైజాగ్ లో వైసీపీ నాయకులు భూములు కొంటున్నారన్నది అర్దం లేని వాదనని, ఇక్కడ భూములు రేట్లు ఇప్పటికే ఆకాశనంటాయన్నారు. ఇప్పుడు భూములు కొనడం సాధ్యం కానీపనని, తక్కువ ధరలకే తుళ్లూరులో తెదేపా నాయకులు భూములు కాజేశారని మంత్రి ఆరోపించారు..మూడు రాజధానుల ప్రకటనతో ఇప్పటికే గందరగోళ పరిస్థితులుంటే నాలుగో రాజధాని కావాలంటు రాయలసీమ పోరాట సమితి కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తిరుమల తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా చేయాలంటు  రాయలసీమ పోరాట సమితీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు..పోను పోను ఆంద్ర రాజధాని విషయం పై ఇంకా ఎంత రగడ జరుగుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat