మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుకు కమ్మగా వంత పాడుతున్న ఎల్లోమీడియా ఛానళ్లు రాయలసీమపై విషయం కక్కుతున్నాయి. కర్నూలులో హైకోర్ట్ వస్తే రెండు జీరాక్స్ మిషన్లు, నాలుగు టీ కొట్లు తప్పా…పెద్దగా ఒరిగేదేం ఉండదంటూ…అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఇక సాంబశివరావు అనే చంద్రబాబు వీరభక్తుడు ఒక ఎల్లోమీడియా ఛానల్లో డిబెట్లు పచ్చపాతంగా నిర్వహిస్తుంటాడు. డిబెట్లలో ఎవరైనా బాబుగారిని విమర్శిస్తే సదరు సాంబడుకు ఎక్కడలేని ఉక్రోషం వస్తుంది. వెంటనే వాళ్లపై నోరుపారేసుకుంటాడు. గతంలో లైవ్ డిబెట్లోనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను బూతుపదంతో వర్ణించిన ఘనుడు ఈ సాంబడు..తాజాగా మూడు రాజధానుల విషయంలో అమరావతిలో తమ కులపెద్ద చంద్రబాబుకు, తమ కులపోళ్ల భూములకు విలువ ఎక్కడ పోతుందనే దుగ్ధతో సాంబడు లైవ్ డిబెట్లు పెట్టి మరీ రాయలసీమపై విషం కక్కాడు. రాయలసీమవాసులను భూకబ్జాదారులుగా, ముఠాకోరులుగా అభివర్ణించాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి ఏడు గంటలకు సాంబశివరావు ‘కేపిటల్లో కేపటలిస్టులు’ పేరుతో ఓ “పచ్చపాత డిబెట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా రాయలసీమపై విషం కక్కాడు.
సీమ వాసులను ఎలా కించపరిచాడో సాంబడు మాటల్లోనే వినండి… ‘రాయలసీమ నుంచి డబ్బుల సంచులతో ముఠాలు వచ్చి భూములు లాక్కుంటాయన్న ఆందోళన ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో పులివెందుల సంస్కృతి ప్రబలుతుందోమోనని సీనియర్ నేత సబ్బం హరి అభిప్రాయపడ్డాడు. అదే నిజమయ్యేలా కనిపిస్తోందని బలహీనవర్గాలు బెదిరిపోతున్నాయి. ఇంతకాలం అన్ని వర్గాలకు ఆశ్రయమిచ్చిన వైజాగ్ ఇకపై ధనిక వర్గాలు, అగ్రకులాలు, భూకబ్జాదారులు, బెదిరింపు ముఠాలకు కేంద్రంగా మారుతుందేమోనని అంతా కలిసి విశాఖ సంస్కృతిని నాశనం చేస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని ఇష్టమొచ్చినట్లు సీమ సంస్కృతిపై, అక్కడి ప్రజలను భూకబ్జాదారులు, ముఠాకోరులుగా వర్ణిస్తూ.. నోరుపారేసుకున్నాడు. దీంతో సాంబశివరావు కులఅహంకారం, కండకావరంపై డిబెట్లో పాల్గొన్న రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, బిజేపీ నేత సత్యమూర్తి మండిపడ్డారు. మీ దృష్టిలో దుర్మార్గుడైన సీఎం జగన్ను రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రానిచ్చి అక్కడ నుంచి పాలించమని చెప్పండి..సన్మార్గులైన చంద్రబాబు, పవన్కల్యాణ్లు అమరావతిని పాలించుకోమని చెప్పండి..అలాగే ప్రజలు తిరస్కరించిన సబ్బం హరి లాంటి వాళ్లా…ఆంధ్ర ప్రజలకు ప్రతినిధులు అంటూ వ్యంగంగా కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా రాయలసీమవాసులపై భూకబ్జాకోరులుగా, ముఠాకోరులుగా నోరు పారేసుకున్న పచ్చ జర్నలిస్ట్ సాంబశివరావుపై సీమవాసులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ తమ ప్రాంత ప్రజలను కించపర్చిన ఈ పచ్చ సాంబడుపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ను సీమవాసులు కోరుతున్నారు.