రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడ రాజకియాలపైనే ఉంటాయి. ఇంకా చెపాలంటే చంద్రబాబు కోసం తనని ఆదరించిన బీజేపీనే కిందకి నొక్కాలని చూసారు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెంటనే ఇక్కడికి వచ్చేసారు. అంతలా రావడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఒకసారి చూసేద్దాం మరి. ఆయన అంత హడావిడిగా వచ్చింది ప్రజల కోసం అయితే కాదని చెప్పాలి. ఎందుకంటే ఆయన కుటుంబానికి రాజధాని ప్రాంతంలో 475 ఎకరాలు ఉన్నట్టు సమాచారం ఉంది.
వేటిపై ప్రభావం చూపుతుందనే భయంతోనే ఆయన ఇక్కడికి వచినట్టు సమాచారం. వెంకయ్య నాయుడు అతని అల్లుడు కలిసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు. ఇంత చేసినా పేరు బయటకు రాలేదు అంటే అది బినామీల దయనే. ఎవరినైతే బినామీలుగా ఉంచితే పేరు బయటకు రాదో వారినే పెట్టారు. దాంతో ఎవరి పేరు బయటకు రాలేదు. కాని సబ్ కమిటీకి మాత్రం ఈ 475 ఎకరాలు తేడాగానే ఉన్నాయని గుర్తించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిగితే మాత్రం అన్నీ బయటకు వచ్చేస్తాయి.. అందుకే హడావడిగా పెద్దాయన రంగంలోకి దిగారు. ఇక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ పోలీసుల వాహనాలు విషయంలో వారి కుటుంబం భారీగా లబ్ధి పొందిందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు. ఇంకా మీరే అర్ధం చేసుకోవాలి.