తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ ప్రగతి పథంలో ముందుకెళ్తుందని ఎల్బ్ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు డివిజన్ లోని రూ. 15 లక్షలతో ఇంద్రసేనా రెడ్డి నగర్ లో కమ్యూనిటీ హాల్, రూ. 10 .20 లక్షలతో వాంబే కాలనీ లో ఫుట్ పాత్ నిర్మాణం, రూ. 10 .70 లక్షలతో ధాతు నగర్ లో UGD , రూ. 30 .00 లక్షలతో ధాతు నగర్ లో BT రోడ్ నిర్మాణం, రూ. 25 లక్షలతో న్యూ దత్త నగర్ లో BT రోడ్ నిర్మాణం, రూ. 19.70 లక్షలతో కృష్ణ నగర్ లో UGD , రూ. 1 .5 కోట్లతో ఇంద్రప్రస్థ కాలనీ లో ఫుట్ పాత్ నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ హస్తినాపురం డివిజన్ లోని పలు కాలనీ లలో రాబోయే కాలంలో మరిన్ని నిధులతో మరింత అభివృద్ధి చేయిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ గజ్జెల మధు గారు,డివిజన్ ప్రెసిడెంట్ రఘుమ రెడ్డి, వార్డ్ కమిటీ సభ్యులు సయ్యద్ పాషా, సత్యం చారి, ఇంద్రప్రస్థ కాలనీ వాసులు శేఖర్ రెడ్డి, వెలుగు నాగార్జున, రంగ రెడ్డి, సత్యదేవ్ ఎనక్లేవ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, కృష్ణ నగర్ ప్రెసిడెంట్ యాదగిరి, జగల్ రెడ్డి, కృష్ణ గౌడ్, ఇంద్రసేనా రెడ్డి నగర్ కాలనీ వాసులు బుజ్జి గోపాల్ నాయక్, దుబ్ల్ నాయక్, లాలూ నాయక్, వాంబే కాలనీ వాసులు సంచి విష్ణు, నరేష్, రెడ్డి మాల కృష్ణ, దత్తు నగర్ వాసులు చమన్ సింగ్ రానా, చండీశ్వర గౌడ్, న్యూ దాత నగర్ కాలనీ వాసులు షేక్ మహమూద్, ఏం.డి.ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 280