Home / MOVIES / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని నా తరపున కోరుతున్నాను.

అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాతావరణ కాలుష్యం వల్ల నా స్నేహితులు చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడదమనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనమందరం కలిసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది.

ఇందులో భాగంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారు. నా తరపున మరోక ముగ్గురికి 1)వితిక 2)జానీమాస్టర్ 3) యాంకర్ రష్మి లను మొక్కలు నాటాలని కోరారు అదేవిధంగా టి.వి చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరు స్వతహాగా మొక్కలు నాటాలని కోరుతున్నాను అని అన్నారుఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat