Home / SLIDER / మంత్రి హారీష్ రావు పిలుపు

మంత్రి హారీష్ రావు పిలుపు

అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం అని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు పిలుపు ఇచ్చారు. బేగంపేటలోని మానస సరోవర్‌ హోటల్‌లో మహావీర్‌, జితో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జితో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.

100 పడకల ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్సలు అందించాలని సెంటర్‌లోని వైద్యులకు, నర్సులకు సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడంలో జైనుల సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

తక్కువ ఖర్చులతో మంచి సంరక్షణను ఈ సంస్థ అందిస్తుందన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నందుకు వారి కోసం తక్కువ ఖర్చులతో ఈ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని హైదరాబాద్‌ చాప్టర్‌ జితో చైర్మన్‌ మనోజ్‌ దుగర్‌ అన్నారు. ఈ సెంటర్‌లో కరోనా రోగులకు 7 రోజులకు కేవలం 28 వేల నుంచి 35 వేల చార్జీ ఉంటుందన్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తామని చెప్పారు.

అత్యవసర వినియోగం కోసం ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. శాఖాహారం, అల్పాహారం, భోజనంతో పాటు ఎవరైనా జైన్‌ ఆహారం కావాలంటే అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి ,జితో  సలహాదారులు నరేంద్ర సురానా, ఆశోక్‌ కొఠారి, సురేందర్‌ బాంటస్‌ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat