కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు.
సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం కరోనా బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతాధృక్పథంతో సేవలు అందించాలని కోరారు.
కరోనా బాధితులకు జీవంపోస్తున్న ప్లాస్మా దాతలు ఇతరులకు స్ఫూర్తిప్రదాతలని అభినందించారు. రాజ్భవన్ రాఖీ ఉత్సవాల్లో పాల్గొన్నవారంతా.. కరోనా వైరస్ బారిన పడినప్పుడు గాంధీ దవాఖానలోనే చికిత్స తీసుకున్నారు. వీరిలో ఆరుగురు రెండు, అంతకంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానంచేశారు. ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానంతో వారు నింపుతున్న స్ఫూర్తిని గవర్నర్ అభినందించారు.