Home / SLIDER / టీపీసీసీ పీఠానికి నేను అర్హుడను..

టీపీసీసీ పీఠానికి నేను అర్హుడను..

టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే.. తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

తనకు అవకాశం ఇస్తే సీనియర్‌ నేతల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటానని, అవసరమైతే గ్రామాల్లోనూ పర్యటిస్తానని పేర్కొన్నారు. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ శ్రేయోభిలాషులు, నేతలు ఎవరైనా తన మాటలను సోనియా, రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం గురించి ఢిల్లీలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని, ఆ పదవిని అడుగుతున్నవారిలో తాను ఒకడినని చెప్పారు.

తన బయోడేటాను ఇప్పటికే సోనియా, రాహుల్‌కు పంపానని వెల్లడించారు. ‘‘నా స్టేట్‌మెంట్ల విషయంలో ఎవరూ గందరగోళ పడొద్దు. ప్రతి దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది.

సమయం వచ్చినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. నా వ్యక్తిత్వం గురించి తెలియక టీఆర్‌ఎస్‌ కోవర్టునంటూ సోషల్‌ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేస్తున్నారు’’అని మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat