Home / MOVIES / ప్రేమలో నేను మోసపోయా-అద్వాణి సంచలన వ్యాఖ్యలు

ప్రేమలో నేను మోసపోయా-అద్వాణి సంచలన వ్యాఖ్యలు

తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచిచూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. హైస్కూల్‌ రోజుల్లో తన ప్రేమాయణం కూడా అలాంటిదేనని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ.

తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. మరోవైపు చదువును అశ్రద్ధ చేస్తున్నానంటూ నా తల్లిదండ్రులు కోప్పడేవారు.

ఈ సంఘర్షణ నడుమ నా ప్రేమను త్యాగం చేశాను. ఆ సమయంలో నేను మానసిక ఎంతో ఆవేదనకు గురయ్యాను. వయసుపరంగా వచ్చిన పరిపక్వతతో క్రమంగా కోలుకున్నా’ అని చెప్పింది కియారా అద్వాణీ. అరంగేట్రం చేసిన అనతికాలంలో బాలీవుడ్‌లో ఈ సొగసరి అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘ధోనీ’ ‘కబీర్‌సింగ్‌’ చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’ ‘భరత్‌ అనే అనే’ చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat