సూపర్ స్టార్ రజనీకాంత్ హై బీపీతో జూబ్లిహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత రాత్రి రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొన్ని రిపోర్ట్స్ రాగా, వాటిలో ఎలాంటి సమస్య లేదని అన్నారు. మరి కొన్ని రిపోర్ట్స్ వచ్చాక వాటిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరి కొద్ది గంటలలో ప్రత్యేక వైద్య బృందం అపోలో ఆసుపత్రికి చేరుకొని రజనీకాంత్ ఆరోగ్యంకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నింటిని పరిశీలించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ బేగంపేట నుండి తన ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లో సాయంత్రం చెన్నైకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. రజనీకాంత్తో ప్రస్తుతం ఆయన కూతురు ఉన్నారు.