Home / SLIDER / కంటతడిపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి..ఎందుకంటే..?

కంటతడిపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి..ఎందుకంటే..?

అనుంగ అనుచరుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దివంగత కర్నాటి విజయభాస్కర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మంత్రి జగదీష్ రెడ్డి కన్నీటిపర్యంతంగా విలపించారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ సాయంత్రం పెద్దవూర మండల కేంద్రంలో టి ఆర్ యస్ పార్టీ ధూమ్ ధామ్ ను నిర్వహించింది.

ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్,ప్రభుత్వ విప్ బాల్కా సుమన్,ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు సీనియర్ టి ఆర్ యస్ నేత యం సి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ధూమ్ ధామ్ కు ముందు ఇటీవల మరణించిన పెద్దవూర గ్రామ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వేదిక మీద వక్తలు దివంగత కర్నాటి విజయ భాస్కర్ రెడ్డి స్మృతులను చెబుతున్న క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి తన అనుంగ అనుచరుడు నియోజకవర్గ పరిధిలో టి ఆర్ యస్ బలోపేతం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించిన విజయభాస్కర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతంగా బాధపడ్డా తీరు ఇటు వేదిక మీద ఆశీనులైన వారితో పాటు ఆహుతులను కంటతడి పెట్టించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat