Home / ANDHRAPRADESH / విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

 ఈనెల 30వ తేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


* రైలు నంబరు 02449-02450 షాలిమార్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.


* రైలు నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈనెల 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌పూర్‌ చేరుతుంది. ఇదే రైలు 13, 20, 27 తేదీల్లో యశ్వంత్‌పూర్‌లో ఉదయం 5.15కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.25కి హౌరా చేరుకుంటుంది.


* రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక రైలును ఈనెల 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat