Home / SLIDER / రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి

రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి

తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని ఆయన తెలిపారు.

60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు సొమ్మును బాకీల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని సూచించారు.

జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు. రైతులకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ. 10 వేలు అందిస్తున్నదని మంత్రి గుర్తు చేశారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat