Home / INTERNATIONAL /  ఆఫ్ఘనిస్తాన్‌ లో దారుణం -ఒక వాటర్‌ బాటిల్‌ దాదాపు రూ.3వేలు..ప్లేట్‌ రైస్‌కు రూ.7500

 ఆఫ్ఘనిస్తాన్‌ లో దారుణం -ఒక వాటర్‌ బాటిల్‌ దాదాపు రూ.3వేలు..ప్లేట్‌ రైస్‌కు రూ.7500

 ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

ఇక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్‌ బాటిల్‌ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు చేరింది. ఇక ప్లేట్‌ రైస్‌కు వంద డాలర్లు (రూ.7500) ఖర్చు చేయాల్సిన దుస్థితి ఎదురైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat