సినీ నటి మీరా మిథున్పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో సమర్పించారు. మీరామిథున్ తమిళ చిత్రసీమకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, మీరా మిథున్పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో దాగివున్న మీరా మిథున్లు స్పెషల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే.