తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్న సంస్థ.ఈ మేరకి ప్రభుత్వంతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్న కంపెనీ, మరియు ప్రభుత్వ అధికారులు.ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కే. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, kitex గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్, కంపనీ సీనియర్ ప్రతినిధి బృందం
సాబు జాకబ్, Kitex చైర్మన్ కామెంట్స్
మాది చిన్నపిల్లల వస్త్రాల తయారీలో ప్రత్యేకమైన కంపెనీ. కంపెనీ నుంచి తయారైన వస్త్రాలు ధరించని పసి పిల్లలు అమెరికాలో ఉండరని చెప్పేందుకు గర్వకారణంగా ఉంది. కేరళ నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ గారి ని కలిసినప్పుడు తనకు పెట్టుబడి కన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలని అడిగారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత తమ వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడిని 2400 కోట్లకు పెంచాము. దీంతో 22000 ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి 3 మిలియన్ల వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తాము. భవిష్యత్తులో తెలంగాణ వస్త్రాలు ధరించని అమెరికా పిల్లలు ఉండబోరు అన్నది మా నమ్మకం… అన్ని కార్మిక సంక్షేమ వసతులతో తమ క్లస్టర్ లలో ఉంటాయి. లక్షన్నర కిట్లను తెలంగాణ ప్రభుత్వానికి తమ కంపెనీ తరఫున అందిస్తాము.
మంత్రి కేటీ రామ రావు కామెంట్స్
కేరళ నుంచి పెట్టుబడులు సంపాదించుకున్నది Kitex సంస్థ వార్త చూసిన తర్వాత నేరుగా జాకబ్ గారితో మాట్లాడడం జరిగింది. రెండు మూడు రోజుల్లోనే జాకబ్ గారు తెలంగాణ కు వచ్చి ఇక్కడి పరిస్థితులను వ్యాపార అనుకూలతను, అవకాశాలు, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని తమ పెట్టుబడిని నిర్ణయాన్ని ప్రకటించారు. ఒక్క ఫోన్ కాల్తో ప్రారంభమైన ఈ పెట్టుబడి చర్చలు, ఈరోజు ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి, 22000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 20,000 పైగా పరోక్ష ఉద్యోగాల కల్పనగా రూపాంతరం చెందింది. కేరళలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అప్పరల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీగా ఉన్న kitex గ్రూప్ ను తెలంగాణకి ఆహ్వానిస్తున్నాం. వరంగల్, రంగారెడ్డి లలో కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను, తమ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం తరఫున అందిస్తాము. ఈ కంపెనీల స్థాపన పూర్తయిన తర్వాత సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ కాటన్ ను కంపెనీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కంపెనీ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అధికంగా అవకాశాలు వచ్చేలా, వారికి అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ప్రభుత్వం తరఫున చేపడతాం… ఈ విషయంలో స్థానిక మహిళా సంఘాలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించిన కేటీఆర్.
మంత్రి దయాకర్ రావు పాయింట్స్
వరంగల్ జిల్లా గీసుకొండ-సంగెం శివారు మరియు రంగారెడ్డి సీతారాంపూర్ లలో దుస్తులు తయారీ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడానికి కైటెక్స్ (KITEX) కంపెనీ ముందుకు రావడం సంతోషం. కైటెక్స్ కంపెనీ యాజమాన్యానికి, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు! . సిఎం కెసిఆర్ పరిపాలనతో దేశంలో తెలంగాణకు మంచి పేరు వచ్చింది. కైటెక్స్ కంపెనీకి కూడా మంచి పేరుంది. తెలంగాణలో కైటెక్స్ కంపెనీ పెట్టే పెట్టుబడులతో, ఇక్కడ ఉత్పత్తి అయ్యే బట్టలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 22వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకా అనేక మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని సిఎం కెసిఆర్ గారు, మంత్రి కెటిఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే TS-iPASS కింద ఉమ్మడి భూ కేటాయింపులు జరిగాయి. అవసరమైన ప్రపంచ స్థాయి అన్ని మౌలిక సదుపాయాలను సకాలంలో ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అలాగే, ఈ రెండు ప్రాంతాల్లో… ప్రత్యేకించి వరంగల్ లో అవసరమైన అన్ని సదుపాయాలు, ఇతర వనరులతోపాటు మానవ వనరులను కైటెక్స్ (KITEX) కంపెనీ కి అందుబాటులోకి తెస్తాం. తెలంగాణలో పండే పత్తి మంచి నాణ్యతతో కూడుకున్నది. ఇక్కడి పత్తికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. ఇక్కడి పత్తితో తయారయ్యే వస్త్రాలు కూడా నాణ్యతగా ఉంటాయి. త్వరగా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయి, మా ప్రజలకు ఉపాధి లభించాలని కోరుకుంటున్నాను.