వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేటన ప్రకటన రానుంది. కరోనా వేవ్స్ ప్రభావం గనక లేకపోయి ఉంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందు వచ్చేసేది. ఎట్టకేలకి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్6డేట్ను దర్శకుడు వేణు ఉడుగుల ఇచ్చాడు.
ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ఇంతకుముందు ప్రచారం సాగింది. వెంకటేశ్ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ కావడంతో ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల స్పందించాడు. ఫారెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘విరాటపర్వం’ థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు రిలీజ్ డేట్ను కూడా త్వరలో ప్రకటించనున్నామని తెలిపాడు. రిలీజ్ డేట్తో కూడుకున్న కొత్త పోస్టర్ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.