న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు.
కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.