కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు.
మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు.
అందులోనూ జిల్లాలోనే అత్యంత మారుమూల మండలాలైన కొత్తగూడ, గంగారం సిగ్నల్ లేని ప్రాంతాలని, అటువంటి ప్రాంతాలలోనే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసి నూరు శాతం సాధించడంతో వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.