దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాల నడుమ ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. మార్చి 1 – 15 మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయాలు 1.23 మిలియన్ టన్నులుగా ఉంది.
గత నెలతో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 18.8%, డీజిల్ 32.8%, గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ధరల పెరుగుదల భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, వీలైనంత ఎక్కువ కొట్టించుకోవడమే దీనికి కారణం.