టీమిండియా మోస్ట్ సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా కౌంటి చాంపియన్ షిప్ లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ససెక్స్ తరపున కౌంటీ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన పుజారా తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పరుగులకే అవుటయ్యాడు.
కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తనదైన శైలీలో విజృంభించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన డార్బీషైర్ ఎనిమిది వికెట్లను కోల్పోయి ఐదువందల ఐదు పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లెర్డ్ చేసింది. ససెక్స్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆలౌటైంది.
ఫాలో ఆన్ ఆడుతున్న ససెక్స్ కు పుజారా ఇరవై మూడు ఫోర్లతో రెండు వందల ఒక్క పరుగులతో నాటౌటుగా నిలిచిపోయారు. మరోవైపు పుజారాకు తోడుగా టామ్ హైన్స్ ఇరవై రెండు ఫోర్లతో రెండు వందల నలబై మూడు పరుగులను సాధించడంతో రెండో ఇన్నింగ్స్ లో ససెక్స్ ఐదువందల పదమూడు పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి మ్యాచ్ ను డ్రా చేసుకుంది.